బ్రహ్మానందం.. ముఖంలో నవరసాలు కనిపిస్తాయి.. ఆయన ఎక్స్ప్రెషన్స్.. కామెడీ.. డైలాగ్ డెలివరీ.. అన్నీ కూడా వెంట వెంటనే మనకు గుర్తొస్తాయి.. ఇక ఎంతటి కోపంలో ఉన్న వారైనా సరే ఆయన కామెడీ చూస్తే తప్పకుండా నవ్వాల్సిందే.. సుమారుగా మూడు తరాల ఆడియన్స్ ను నవ్విస్తూ వస్తున్నాడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. ఆయన ఎలాంటి డైలాగ్స్ కొట్టక పోయినా సరే తెరపై ఆయన ఫేస్ కనిపించిందంటే చాలు ప్రేక్షకుల మోములో నవ్వుల వర్షం కురుస్తుంది.. సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులు ఆయన ఒక్క సీన్ లోనైనా కనిపించక పోతారా అంటూ ఎదురు చూసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అంతలా బ్రహ్మానందం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు.


ఇక కొన్ని సందర్భాలలో అయితే బ్రహ్మానందం కోసమే సినిమా చూడడానికి ప్రేక్షకులు వెళ్తారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.. దర్శకులు సైతం ఆయన కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను కూడా సృష్టిస్తూ ఉంటారు.. ఇక ఇలాంటి బ్రహ్మానందం పై మెగా బ్రదర్ నాగబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..తాజాగా ఒక టీవీ ఛానల్ లో నిర్వహించిన దావత్ అనే ప్రోగ్రాం కి చీఫ్ గెస్ట్ గా బ్రహ్మానందం హాజరయ్యారు.. ఆయన తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కామెడీతో..అక్కడ ఆ షో కి హాజరైన వారందరినీ కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం . ఈ సందర్భంగా నాగబాబు తన మనసులో ఉన్న విషయాలను బ్రహ్మానందంపై తన ఉద్దేశం ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపెట్టారు.. ఇక ఈ మాటలు కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీ లో వైరల్ గా మారుతున్నాయి.. నాగబాబు మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి రేలంగి తరువాత అంతటి స్థానం బ్రహ్మానందంకే దక్కుతుంది..ఈయన లేకుంటే ఇండస్ట్రీ ఉప్పులేని కూరగా ఉండేది అంటూ కామెంట్ చేశారు.. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఉప్పులా ఈయన ఎంటరయ్యాడు ఈ మహానుభావుడు అంటూ బ్రహ్మానందాన్ని ఉద్దేశించి మెగాబ్రదర్ అన్న మాటలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.. ఇక బ్రహ్మానందం ప్రత్యేకంగా దానధర్మాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని ఆయన అందర్నీ నవ్విస్తాడు కాబట్టే ఆ పుణ్యం అతనికి లభిస్తుంది అని తెలిపాడు నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: