మెగా సుప్రీం హీరో సాయి తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కొత్త సినిమా ముచ్చట్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా సాయి తేజ తన కొత్త సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. నేను కోలుకున్న అంటూ ఆమధ్య ఒక మెసేజ్ అయితే చేశాడు ఈ మెగా హీరో. ఇక తర్వాత తన కెరియర్ గురించి తన కొత్త సినిమాల సంగతుల గురించి ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కాకపోతే రోడ్డు ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత సాయి తేజ్ మాత్రం కెమెరాముందుకు కనిపించాడు.

దీపావళినాడు మెగా హీరోలు అందరూ కలిసి సాయి ధరమ్ తేజ్ ని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు.అప్పుడు కూడా తేజు తన కొత్త సినిమాల గురించి చెప్పలేదు. కానీ ఆయన యోగ క్షేమాలు కోరుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అయితే తేజ్ కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు? అంటూ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సాయి తేజ్ కి మెసేజ్ లు చేస్తూనే ఉన్నారు. ఇక అలాంటి తేజు ఫ్యాన్స్ కి ఓ శుభవార్త. ఈ మెగా సుప్రీం హీరో ఈ నెలలోనే సెట్స్ పైకి మళ్లీ అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ డబుల్ ఎనర్జీ తో కనిపిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమా సెట్లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఇటీవల బ్రేక్ పడిన 'సాయిధరమ్ తేజ్ 15' వ సినిమా మళ్లీ పట్టలెక్కబోతున్నట్లు సమాచారం. కొత్త దర్శకుడు కార్తీక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి మూడవ వారం నుంచి మొదలు కాబోతుంది.  యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ నటిస్తున్న తొలి సినిమా ఇదే. అందుకే ఈ సినిమాపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చిత్రయూనిట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: