పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ల కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్' సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశం నిర్మిస్తున్న ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ కి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ఫిబ్రవరి 25 కి వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉన్నట్లు సమాచారం.

అయితే ఇదిలా ఉంటే తాజాగా భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి అవగా.. ఇంకా పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉందని సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే షూటింగ్ నిలిపివేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీని కారణంగా ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో  టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త మాత్రం జోరుగా ప్రచారం అవుతోంది.

మరి ఈ విషయమై మేకర్స్ స్పందించి దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక యువ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యమీనన్, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా.. దగ్గుబాటి రానా లోకల్ డాన్ గా కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: