టాలీవుడ్ స్టార్ దర్శకుడు దర్శకధీరుడు రాజమౌళి ఈ నెల 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసి ఆ తర్వాత మహేష్ సినిమా పనులతో ఫుల్ గా ఫోకస్ పెట్టి బాగా బిజీ కావాలని అనుకున్నారు.అయితే ఎవరూ ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటం వల్ల జక్కన్న తర్వాత సినిమాలపై కూడా ఊహించని స్థాయిలో ప్రభావం అనేది పడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో జక్కన్న తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేష్ సినిమాపై ఫోకస్ పెట్టారని సమాచారం.తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి రాజమౌళి మహేష్ సినిమా కథను బాగా చెక్కుతున్నారని సమాచారం తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో రాజమౌళి మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి ఈ ఇయర్ సెకండాఫ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో ఇండియానా జోన్స్ హీరో లాంటి పాత్రలో నటించే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.అటు మహేష్ ఇటు రాజమౌళిసినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని సమాచారం తెలుస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. రాజమౌళి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కాగా ఈ సినిమా కోసం కొన్ని లక్షలాది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: