ఇకపోతే పుష్ప ది రైస్.. మొదట నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఏకంగా సునామీ సృష్టిస్తోంది ఈ సినిమా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడోసారి పుష్ప సినిమాను తెరకెక్కించగా.. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తాజాగా ఓటీటీలో విడుదలవ్వగా విశేష ప్రేక్షకాదరణ పొందడంతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను చూసి ట్విట్టర్ ద్వారా తెగ పొగిడేస్తున్నారు. ఇకపోతే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఉత్తరాది కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళనాడులో అయితే ఏకంగా రెండు రోజుల్లోనే నాలుగు కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.
ఇక తాజాగా ఈ సినిమాను విశ్వనటుడు కమల్ హాసన్ కూడా వీక్షించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను, అల్లు అర్జున్ , రష్మిక మందన అందర్నీ కూడా ఆయన అభినందించారు. ఇకపోతే కేశవ పాత్రకు కూడా మంచి మార్కులు.. చిత్తూరు జిల్లా యాస తో హీరో హీరోయిన్లు చక్కగా తమ పాత్రలలో లీనమై పోయారు.. ఇక మొత్తానికి అయితే ఈ సినిమాలో ఉండే నటీనటులు అందరూ కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఈ సినిమా సీక్వెల్ లో కూడా కంటిన్యూ కాబోతున్నారు.