మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి పీక్లో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి పెట్టి సినిమాలకు కొంత కాలం దూరం అయిన విషయం మన అందరికి తెలిసిందే, ఆ తర్వాత చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ వన్ 150 తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు,  ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి హీరోలకు నేను ఏమీ తక్కువ కాదు అని చిరంజీవి నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఆచార్య సినిమా ఒకటి, ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇలా జనాల్లో మంచి అంచనాలు ఉన్న ఉన్న  ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

కాకపోతే ప్రస్తుతం దేశంలో కారోనా కేసులు పెరుగుతుండడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయడం లేదని చిత్ర బృందం తెలియజేసింది, అలాగే ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా తెలియజేసింది, ఇలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఈ సినిమా విడుదల తేదీ పై టాలీవుడ్ హీరో తేజ సజ్జా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు, ఇంద్రలో చైల్డ్ కారెక్టర్‌లో కనిపించిన తేజ సజ్జ, చిరంజీవి కి అభిమాని అనే విషయం మన అందరికీ తెలిసిందే, మారింది సినిమా రిలీజ్ డేట్ మాత్రమే, బాక్స్ ఆఫీస్ ఫేట్ కాదు, ఈ ఉగాది కి వస్తున్నరు, ఉత్సవాలకు రెడీ అయిపోండి అంటూ తేజ సజ్జా సోషల్ మీడియా వేదికగా ఆచార్య సినిమా విడుదల తేదీ పై  స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: