తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా మూడు విజయాలను సొంతం.. చేసుకున్న కథానాయికలలో హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన మూవీతో మంచి కలెక్షన్లు రాబట్టి.. ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు వంటి సినిమాలను హీట్ టాక్ తో తన ఖాతాలో వేసుకుంది. బంగార్రాజు సినిమా కి ప్రతి రోజు కలెక్షన్లు బాగానే పెరుగుతున్నట్లుగా సమాచారం. అతి తక్కువ సమయంలోనే బంగార్రాజు సినిమా షూటింగును పూర్తి చేసుకున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఇక అంతే కాకుండా ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కాస్త సమయాన్ని ఎక్కువగా కేటాయించి ఉంటే.. దీని రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని ఇండస్ట్రీలో టాక్  వినిపిస్తోంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారు. తాజాగా కృతి శెట్టి హీరో నితిన్, సుధీర్ బాబు తో కలిసి సినిమాలను రూపొంది. ఇక వీరితో పాటే హీరో రామ్ తో కూడా ఒక సినిమాని చేయబోతోంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు ఫామ్ లో లేరని చెప్పవచ్చు.  ఈ హీరోలకు కూడా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ అయిందంటే ఇక ఈమె అదృష్టం మారిపోతుంది.

కృతి శెట్టి తన కెరీర్ ప్లాన్ బాగా చక్కదిద్దుకుంటు వెళుతోంది ముందుకు. ప్రేక్షకులు ఎలాంటి కథను ఎంచుకుంటే ఇష్టపడతారు అనే విషయం ఈమె బాగా గ్రిప్ లో పెట్టుకుంది. ఇక రష్మిక, పూజ హెగ్డే ల కు గోల్డెన్ లెగ్ అని పేరు ఎలా వచ్చిందో ఈమెకు కూడా అలాంటి పేరు నే సొంతం చేసుకుంది. ఒకవేళ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటిస్తే ఈమె క్రేజ్ మరింత పెరగవచ్చట.. సోషల్ మీడియాలో ఎవరు ఊహించని స్థాయిలో కృతి శెట్టి ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. తాజాగా ఈమె ఇతర భాషలలో సైతం.. నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: