2022 లో ఆర్.ఆర్.ఆర్, ఆచార్య రెండు మెగా సినిమాలతో సందడి చేయనున్నారు మెగా పవర్ స్టార్ రాం చరణ్. ఈ సినిమాల తర్వాత శంకర్ డైరక్షన్ లో చరణ్ సినిమా ఉంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. శంకర్ డైరక్షన్ లో చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కే ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తున్న విషయం తెలిసిందే. థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలో సునీల్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ ఇంకా టైం ఉంది కాబట్టి శంకర్, చరణ్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సినిమాని 200 కోట్ల భారీ డీల్ తో జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందని టాక్.

చరణ్ సినిమా డిజిటల్, శాటిలైట్ రెండిటి హక్కులను జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ సూపర్ హీరోగా కనిపిస్తాడని టాక్. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రోజే రిలీజ్ చేసిన స్టిల్ తో సినిమాపై క్రేజ్ పెరిగింది. ఐ, 2.ఓ సినిమాలతో కెరియర్ పరంగా వెనకపడ్డ శంకర్ చరణ్ సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటన్నది చూపించాలని చూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తర్వాత చరణ్ సినిమా అంటే నేషనల్ వైడ్ గా భారీ హైప్ వస్తుంది. అందుకే ముందే శంకర్ సినిమాకు భారీ రేటు ఇచ్చి రైట్స్ పొందారు. ఈ సినిమాతో చరణ్ నేషనల్ ఇమేజ్ కన్ ఫర్మ్ చేసుకుంటాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: