యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేశాడు, ఈ సినిమాను జనవరి 7వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది, అయితే ఈ సినిమా కోసం చిత్ర బృందం పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ లను చేసింది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నకొద్దీ దేశంలో కరోనా కేసులు విరివిగా పెరిగిపోతుండడంతో అలాగే అనేక రాష్ట్రాలలో థియేటర్ లపై ఆంక్షలు విధించడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది, అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడడంతో ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పనులను అన్ని ముగించడంతో తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది,  ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

అయితే ప్రస్తుతం కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది, అయితే ఈ సినిమా పనులు కూడా దాదాపుగా ముగియడంతో ఫిబ్రవరి నుండే ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా ప్రారంభించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు అనిరుద్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కించబోయే సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాగా తెరకెక్కినబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: