ఒక నార్మల్ సాదా సీదా హీరో స్టార్ హీరో అయ్యాక తప్పకుండా పారితోషకం పెంచేస్తూ ఉంటాడు. హీరో హీరోయిన్ లు మాత్రమే కాకుండా దర్శకులు సైతం ఈ విషయంలో ఏమాత్రం వెనుకాడరు. అలా తమ మార్కెట్ ను బట్టి తమ పాపులారిటీని బట్టి వారు తమ రెమ్యునరేషన్ ను సెట్ చేస్తూ ఉంటారు. కెరీర్ మొదట్లో లక్షల్లో  పారితోషకం తీసుకున్న కొంతమంది హీరోలు స్టార్డమ్ వచ్చాక కోట్లల్లో పారితోషకం తీసుకోవడం మొదలు పెట్టారు. ఆ విధంగా పెళ్లిచూపులు సినిమా తో ఓ సాదాసీదా హీరోగా పరిచయం ప్రేక్షకులకు పరిచయమైన విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే.

ఆ సినిమాకి ఆయన రెమ్యునరేషన్ గా లక్షలు కాదు కదా వేలల్లో రెమ్యునరేషన్ తీసుకున్నాడేమో అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండడం ఒక్కసారిగా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కెరీర్లో చేసిన అర్జున్ రెడ్డి సినిమా మామూలు విజయం సాధించలేదు. ఆ చిత్రం వల్ల ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అప్పుడే ఆయన తన పారితోషకాన్ని కోట్లలోకి పెంచుకుని సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఇక ప్రస్తుతం ఆయన లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు 9 సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమా పై వంద కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఏకంగా 35 కోట్లు పారితోషకం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలు తెలిసిన తర్వాత విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ క్రేజ్ కు ఆమాత్రం రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. మరి లైగర్ విడుదల తర్వాత ఈ హీరో ఎంతటి స్థాయిలో తన పారితోషికాన్ని పెంచుతాడోచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: