టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా సర్కారు వారి పాట చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇటీవల మహేష్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో పాటు ఆయన సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు హఠాత్తుగా మరణించడంతో ఇప్పట్లో ఆ సినిమా తదుపరి షెడ్యూల్ జరుగకపోవచ్చని టాలీవుడ్ వర్గాల సమాచారం. అలానే మహేష్ ని ఇటువంటి బాధ సమయంలో కదిలించడం ఇష్టం లేని యూనిట్ కూడా కొన్నాళ్ల పాటు షూట్ ని వాయిదా వేసిందట. మరోవైపు మహేష్ ఇప్పటికే తన తదుపరి చేయబోయే సినిమాల లిస్ట్ ని ఒక్కటొక్కటిగా సిద్దము చేస్తున్నట్లు తెలుస్తోంది.

సర్కారు వారి పాట అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు మహేష్. ప్రముఖ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. దాని తరువాత మహేష్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి తో వర్క్ చేయనున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్న భారీ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు టాక్. ఇక ఈ రెండిటి అనంతరం యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో ఒక మూవీని మహేష్ చేయనున్నట్లు సమాచారం.

పక్కా యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ ఎంతో భారీగా రూపొందనుందట. వీటి అనంతరం కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజక్ట్, అలానే ఆపైన తనతో గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కొరటాల శివ లతో కూడా సూపర్ స్టార్ మూవీస్ చేయనున్నారని, ఇప్పటికే ఆయా దర్శకులు మహేష్ కోసం కథలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాల లైనప్ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కనుక మంచి విజయాలు సొంతం చేసుకుంటే హీరోగా మహేష్ రేంజ్ అమాంతం ఆకాశం అంత ఎత్తుకు పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: