సినిమా పరిశ్రమలో ఎవరి టైం ఎప్పుడు మొదలవుతుందో ఎవరి టైం ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పలేము. వారికి వచ్చే అవకాశాలను బట్టి వారి కెరియర్ ఆధారపడి ఉంటుంది. ఆ అవకాశాలతో నిరూపించుకోగలిగితే వారు స్టార్స్ అయినట్లే. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుల విషయంలో ఓ ఇద్దరు సంగీత దర్శకుల మధ్య భారీ పోటీ నెలకొంటుంది. సినిమా సినిమాకి వారి స్టార్డమ్ పెరిగిపోతుండడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ తన సినిమాతో ఒక్కసారిగా మునుపెన్నడూ లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.  

అంతకుముందు రెండు మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా అవతరించాడు తమన్. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ మాత్రమే కాకుండా సంగీతం పరంగా కూడా ప్రేక్షకులను అలరించడం తో టాలీవుడ్ లో ఏ సంగీత దర్శకుడికి కి అందని రేంజ్ కి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా మంచి అవకాశాలు అందుకునే దేవిశ్రీ ప్రసాద్ కు టాలీవుడ్ లో అవకాశాలు ఒక్కసారిగా తగ్గి పోయాయి అని చెప్పొచ్చు. తమన్ పాపులారిటీ పెరిగే కొద్దీ దేవిశ్రీప్రసాద్ అంతకంతకూ తగ్గిపోయారు అనే విమర్శలు రోజురోజుకూ ఎక్కువ అయ్యాయి.

దాంతో ఒక సారి భారీ స్థాయిలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం దేవిశ్రీ ప్రసాద్ కు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఒక మంచి అవకాశంగా పుష్ప సినిమా అవకాశం రాగా ఆ సినిమా తో టాలీవుడ్ మాత్రమే కాదు దేశ స్థాయిలో ప్రేక్షకులను అలరించి మళ్ళీ తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  ఇప్పుడు ఈ ఇద్దరు సంగీత దర్శకుల మధ్య పోటాపోటీగా ఎంతో ఆసక్తికరంగా పోటీ ఏర్పడింది అని చెప్పవచ్చు.  ఒకసారి తమన్, ఒకసారి దేవిశ్రీప్రసాద్ లైమ్ లైట్ లోకి వస్తున్న నేపథ్యంలో ఈ సారి తమన్ ఏ విధమైన కం బ్యాక్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: