చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ  సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఏదో తెలియని ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకంటే అన్ని సినిమాలు ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంటాయి. కానీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మాత్రం ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఇలా ఇప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లర్గా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసినా బ్లాక్ బస్టర్ సినిమాలు చాలానే ఉన్నాయి టాలీవుడ్లో. ఇక అలాంటి సినిమాలు ఏవో తెలుసుకుందాం.



 ఆర్ ఎక్స్ 100 : ఈ సినిమాలో ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కొత్త హీరో కొత్త దర్శకుడు కొత్త హీరోయిన్ కథ కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా కొత్తగానే ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ఊహలో ఉండే విలన్ రావురమేష్ మాత్రమే. హీరో మీద అటాక్ చేయిస్తుంది రావు రమేష్ అని అనుకుంటారు అందరు. కానీ రావు రమేష్ కాదు అంతకుమించిన కథ నడిపిస్తుంది హీరోని ప్రాణంకంటే ఎక్కువ ప్రేమించాను అంటూ చెప్పినా హీరోయిన్ అన్నది బయటపడుతుంది.  దీంతో ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఈ కథ యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.


 హిట్  : మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకి నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. అయితే మొదటి నుంచి ఈ సినిమా ఎంతో ఉత్కంఠభరితంగా  సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్  ను కిడ్నాప్ చేసిన విలన్ ఎవరు అని వెతకడం ప్రారంభిస్తాడు హీరో. ఇక హీరో కి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఒక స్నేహితుడు. ఇక చివర్లో ఇందులో విలన్ ఎవరో కాదు పక్కనే ఉండి సహాయం చేస్తున్న స్నేహితుడు అని ట్విస్ట్ ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు.


 ఎవరు : అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరూ సినిమా సస్పెన్స్ తో ప్రేక్షకులను మునివేళ్ళపై నిలబడగలిగింది.  ఎన్నో ఊహకందని ట్విస్టులు  ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తాయి. రెజినా  దగ్గర నిజాలు రాబట్టేందుకు వచ్చింది పోలీస్ కాదు రెజీనా వల్ల బాధ పడిన ఒక బాధితుడు అన్న ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 రంగస్థలం : అబ్బో ఈ సినిమాలో ట్విస్ట్ అయితే ప్రేక్షకులు కలలో కూడా ఊహించనిది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ట్విస్ట్ లెక్కల మాస్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ పనితనానికి మారుపేరుగా మారిపోయింది. మొదటినుంచి చిట్టిబాబు అన్నను హత్య చేయించింది  ఊరి ప్రెసిడెంట్ అని అనుకుంటారు అందరూ. చివర్లో ఆ హత్య చేయించింది మంచి వాడిలా నటిస్తున్న ప్రకాష్ రాజ్ అన్న విషయం బయటపడుతుంది.


 కేరాఫ్ కంచరపాలెం,: చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుడి మదినీ తాకింది ఈ సినిమా. ఇక ఈ సినిమా లోని ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకుడికి  బాగా కనెక్ట్ అయిపోతుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమాలు  ప్రేక్షకులు చూసిన నాలుగు పాత్రలు కూడా రాజు అనే వ్యక్తి జీవితంలో జరిగినవే అనే ట్విస్టు చివర్లో బయటపడుతుంది. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: