టాలీవుడ్ లో ఉన్న మాస్ డైరక్టర్స్ లో యువ దర్శకుడు సంపత్ నంది ఒకరు. ఆయన చేస్తున్న సినిమాలు మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటాయి. అయితే అతని డైరక్షన్ లో సినిమా అంటే మాత్రం హీరోయిన్ గా తమన్నా ఫిక్స్ అన్నట్టే లెక్క. తొలి సినిమా ఏమైంది ఈవేళతో హిట్ అందుకుని నెక్స్ట్ సినిమానే మెగా ఛాన్స్ అందుకున్నాడు సంపత్ నంది. రాం చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది అసలైతే ఆ మూవీతోనే స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరాల్సి ఉన్నా ఎందుకో టైం కలిసి రాలేదు.

తన మార్క్ మాస్ సినిమాలతో ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ సంపత్ నంది డైరక్టర్ గా వెనకపడ్డాడనే చెప్పాలి. ఇక ఈ డైరక్టర్ తో సినిమా అంటే తమన్నా హీరోయిన్ గా ఫిక్స్ అవ్వాల్సిందే. రచ్చ సినిమాతో తమన్నాని మొదట హీరోయిన్ గా తీసుకున్న సంపత్ నంది ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజతో చేసిన బెంగాల్ టైగర్ సినిమాలో కూడా ఆమెనె రిపీట్ చేశాడు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన సీటీమార్ సినిమాలో కూడా మళ్లీ మిల్కీ బ్యూటీ తమన్నానే ఎంపిక చేశాడు.

డైరక్టర్ గా సంపత్ నంది ఇప్పటివరకు చేసిన 5 సినిమాల్లో 3 సినిమాల్లో తమన్నాని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఒకవేళ తమన్నా తనకు సెంటిమెంట్ అని భావిస్తున్నాడో లేక తన కథల్లో హీరోయిన్ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాడో కానీ డైరక్టర్ సంపత్ నంది హీరోయిన్ తమన్నా కాంబో ఇండస్ట్రీలో సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఇలానే తమన్నాతో సంపత్ నందిహీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా చేసినా చేస్తాడని చెప్పుకుంటున్నారు. ఇదే కాదు సంపత్ నంది రాబోయే సినిమాల్లో కూడా తమన్నాని మళ్లీ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్.




మరింత సమాచారం తెలుసుకోండి: