టాలీవుడ్ లో ప్రస్తుతం యువ కథానాయికగా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఒకరు అనే చెప్పాలి. ఛలో సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ, ఆ మూవీ తో సూపర్ హిట్ కొట్టారు. నాగ శౌర్య హీరోగా చేసిన ఛలో మూవీని వెంకీ కుడుముల తీశారు. అనంతరం విజయ్ దేవరకొండతో గీత గోవిందం మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి యువతలో విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్న రష్మిక, ఆపైన సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసారు.

ఇక ఇటీవల నితిన్ తో భీష్మ సినిమా చేసి దానితో కూడా విజయం అందుకున్న రష్మిక, కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో శ్రీవల్లి అనే పాత్రలో తనదైన ఆకట్టుకునే టాలెంట్ తో మరొక్కసారి ఆడియన్స్ మనసు దోచుకున్నారు. పుష్ప రిలీజ్ తరువాత ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకోవడంతో పాటు హీరోయిన్ గా రష్మిక కి కూడా మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టింది. దానితో రష్మిక తన పారితోషికాన్ని కూడా కొంత మేర పెంచారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం తెలుగులో రష్మిక ఒక్కో సినిమాకి గాను కోటికి పైగా పారితోషికం తీసుకుంటున్నారని, తక్కువకాలం లోనే తెలుగులో ఈ రేంజ్ పారితోషికం అందుకున్న నటీమణుల్లో రష్మిక కూడా ఒకరని అంటున్నారు.

ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప 2 సినిమాలు ఉన్నాయి. మరోవైపు అటు తమిళ్, కన్నడ లో కూడా ఛాన్స్ లు అందుకుంటున్న రష్మిక మందన్న అటు హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆ విధంగా అన్ని భాషల్లోనూ మంచి విజయాలు సొంతం చేసుకుని నటిగా మరింత మంచి క్రేజ్ దక్కించుకోవాలని చూస్తున్న రష్మిక, రాబోయే సినిమాలతో పక్కాగా విజయాలు అందుకుంటే తప్పకుండా మిగతా హీరోయిన్స్ కంటే కూడా మరింతగా దూసుకెళ్లడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: