సినిమాలకు పునాది వేసేది వాటిని తీర్చిదిద్దేది దర్శకులే. సినిమా దర్శకుడిని బట్టి , హీరోలను బట్టి ఆ మూవీ ఎలా ఉండబోతుందని అంచనా వేసే రోజులివి. ఇక టాలీవుడ్ లో ఎందరో హీరోలను తమ డైరెక్షన్ తో ఇండస్ట్రీలో నిలబెట్టిన దర్శకులు ఉన్నారు. తమ ప్రతిభతో సూపర్ హిట్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన దర్శక దిగ్గజాలు ఉన్నారు. ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు సర్వ సాధారణమైపోయాయి. అయితే పలువురు ప్రముఖ దర్శకులు సైతం ప్రేమ వివాహాలు చేసుకుని తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వారెవరో ఇపుడు చూద్దాం పదండి.

* టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఆయన భార్య  – రమా రాజమౌళి, వీరిది ప్రేమ వివాహం. అయితే వీరిదో డిఫరెంట్ లవ్ స్టోరీ. రమాకు ముందుగానే వివాహం అయ్యి 9 ఏళ్ల కొడుకు ఉన్న సమయంలో ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమెను ప్రేమించిన డైరెక్టర్ రాజమౌళి పెద్దలను ఎదిరించి రమా గారిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

* మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పూరి జగన్నాథ్ సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. పూరి తన కెరియర్ ఆరంభంలో దూరదర్శన్ లో పనిచేసే సమయంలో అక్కడ లొకేషన్ కోసం ఒక ఇంటికి వెళ్ళగా  లావణ్యను చూసి ప్రేమించి పెద్దలలో మాట్లాడి ఆమెను వివాహం చేసుకున్నాడు.

* హీరోయిన్ రమ్య కృష్ణ , దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చంద్ర లేఖ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు, ఆ తరవాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

* దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా శ్రీ విధ్య అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు.

* డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత ప్రియాంక దత్ తో ప్రేమలో పడి అనంతరం వివాహం చేసుకున్నారు.

ఇలా పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని సాఫీగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: