ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా రాణించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకునీ కొన్ని రోజుల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి తర్వాత మాత్రం చిత్రపరిశ్రమలో కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో చెప్పుకోదగ్గ హీరోయిన్ మహేశ్వరి. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది ఈ అమ్మడు. గులాబీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులందరీ చూపులు మొదటి సినిమాతోనే తన వైపు తిప్పుకోవడం లో ఒక్కసారిగా మహేశ్వరి సక్సెస్ అయింది. ఇక తన హస్కీ వాయిస్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్.



 మొదటి సినిమానే సూపర్ సక్సెస్ సాధించడంతో ఇక ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చి ముంగిట వాలిపోయాయి. అదే సమయంలో ఇక మహేశ్వరి శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి కావడంతో ఇక ఇండస్ట్రీలో ఈ అమ్మడికి తిరుగులేకుండా పోయింది అని చెప్పాలి. ఇక గులాబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వడ్డే నవీన్ తో కలిసి నటించిన పెళ్లి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించింది మహేశ్వరి. ఇకపోతే మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయినా మహేశ్వరి ఆ తర్వాత మాత్రం ఫ్లాపులు చుట్టుముట్టడంతో కెరీర్ కు కాస్త అయోమయంగా మారిపోయింది.  ఇక అవకాశాలు కూడా తగ్గిపోయాయి.


 ఇలాంటి సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది మహేశ్వరి. ఇకపోతే ఇటీవలే తనకు  శ్రీదేవి కి సంబంధం ఏంటి అనే విషయం పై క్లారిటీ ఇచ్చేసింది.  ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరి ఈ సందర్భంగా శ్రీదేవికి తనకు ఏమవుతుంది అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. శ్రీదేవి తనకు చిన్నమ్మ్మ అవుతుంది. ఆమె మాకు దూరం అయింది  అన్న విషయం ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము  అంటూ చెప్పుకొచ్చింది. అదే సమయంలో శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చినందుకు నాకు పొగరు ఉంది అని అప్పట్లో దర్శకనిర్మాతలు అనేవారని.. సైలెంట్ గా ఉండడం వల్ల పొగరు అనుకున్నారు అంటూ పాత రోజులను గుర్తు చేసుకుంది మహేశ్వరి.

మరింత సమాచారం తెలుసుకోండి: