తొలిసారిగా మళయాళంలో చేసిన సినిమా హేజూడ్ 2018లో ఫిబ్రవరి 02న విడుదల అయింది. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష సరసన ప్రముఖ మళయాళనటుడు నివిన్ పాల్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది. సినిమా ప్రారంభం అయ్యే కొచ్చిలోనే అయినప్పటికీ.. తరువాత కథ గోవాకు మారుతుంది. హీరో జూడ్ కొచ్చి నుంచి తన తండ్రితో కలిసి అనుకోకుండా వచ్చిన ఓ ఆస్తిని పొందడానికి గోవాకు వెళ్లడం, అక్కడ హీరోయిన్ క్రిస్టల్ తో పరిచయం కావడం, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారిందన్నదే ఈ చిత్రం యొక్క కథ.
ఇక ఇందులో నివిన్ పౌల్ బుద్ధిమాద్యం ఉన్న యువకునిగా నటించాడు ఈ చిత్రంలో. మేథస్సులో అతనికి తిరుగు లేకపోయినా.. వ్యవహారిక విషయాల్లో తన వయస్సుకు తగ్గ పరిపక్వత లేని యువకుని పాత్రను పోషించాడు. ఆ కారణంగా అతనికీ సమాజం నుంచి తోటి వ్యక్తుల నుండి రకరకాల సమస్యలు ఎదురవ్వడంతో పాటు.. అతను ఈ సమాజం నుంచి తోటి వ్యక్తుల నుంచి సమస్యలను ఏవిధంగా అధిగమిస్తూ ముందుకు సాగాడు అనేదే ఈ సినిమా. సిద్ధిక్, నీనా కురూప్, విజయ్ మీనన్, అపూర్వబోస్, అజూవర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకు నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చడం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఆహాలో జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నది. మరొక వైపు ఇటీవలే త్రిష కరోనా బారి పడి చికిత్స పొందుతున్నది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతూ ఉన్నారు.