ఇక దీంతో ఓంకార్ కి షాక్ తగలడంతో కాస్త సైలెంట్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత బుల్లితెర పైన ఫోకస్ పెట్టాడు. స్టార్ మా ఛానల్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఓంకార్.. అందులో భాగంగానే..ప్రస్తుతం ఇస్మార్ట్ జోడి షో మీదే ఎక్కువగా తన దృష్టిని పెట్టేశాడు.. ఇందులోని మొదటి సీజన్ బాగా సక్సెస్ కావడంతో దీనికి రెండవ సీజన్ ను కూడా చేస్తున్నాడు. ఇటీవలే ఇస్మార్ట్ జోడీ షో విడుదల కాగా మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తోంది.
ఇస్మార్ట్ జోడి-2 షో అయిపోయిన తర్వాత.. ఓంకార్ తిరిగి మళ్ళీ రాజుగారి గది సినిమా కు సంబంధించి.. మరొక సీక్వెల్ను ప్రారంభించనున్నట్లు సమాచారం. రాజుగారు గది సీక్వెల్లో ఈసారి నాలుగో భాగాన్ని తీయబోతున్నాడు ఓంకార్. ఇందులో గతంలో రవితేజ నటిస్తున్న అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే అది సెట్ కాలేకపోయింది.. అయితే ఈసారి రాజుగారు గది-4 కి ఓంకార్ డైరెక్షన్ లో ఎవరు నటిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఇలాంటి సీక్వెల్స్ సక్సెస్ అయ్యాయి అంటే ఎన్ని సీక్వెల్స్ తీస్తారో చూడాలి..