'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని తన అకౌంట్ లో వేసుకుంది ఈ చిన్నది.ఆ విజయంతో యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది.ఇక ఆ తరువాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' వంటి సినిమాలతో మరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ యంగ్ బ్యూటీ అలీతో సరదాగా ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చింది.బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కలిసి పలు ఆసక్తికర విషయాలను ఈమె వెల్లడించింది. తను కర్ణాటకకు చెందిన అమ్మాయే అయిన తాను మాత్రం పుట్టిపెరిగింది  ముంబైలో అని చెప్పింది. మొదట కొన్ని యాడ్ షూట్స్ చేస్తూ.. ఇక ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని కృతి చెప్పుకొచ్చింది.
 
తన మొదటి సినిమా 'ఉప్పెన' విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిన కృతి .. ఈ సినిమాకి గాను మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.మెగాస్టార్ చిరంజీవి గారు 'ఉప్పెన' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి మాట్లాడడమే చాలా పెద్ద గిఫ్ట్ లా అనిపించిందని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ఆయనొక గిఫ్ట్ పంపించారని చెప్పింది కృతి శెట్టి. అది ఆయన చేతి రాతతో రాసిన ఓ లెటర్గిఫ్ట్ చిరంజీవి గారు పంపించారని ఆమె చెప్పుకొచ్చింది. యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని ఆయన ఆ లెటర్‌లో రాశారని, దాంతో ఆ లెటర్ ఫ్రేమ్ కట్టించి ఇంట్లో దాచుకున్నానని కృతి శెట్టి తెలిపింది.

టాలీవుడ్ సినిమా స్టార్ హీరోల్లో రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. 'రంగస్థలం' సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మన్స్ బాగా నచ్చిందని.. ఛాన్స్ దొరికితే ఆయనతో కలిసి నటించాలనుందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ సుధీర్ బాబు ఇంకా అలాగే నితిన్ లాంటి యంగ్ హీరోలతో కలిసి నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: