ఓ పక్క బాగా నవ్వించే స్టార్ కమెడియన్‌గా రాణిస్తూనే మరో పక్క హీరోగా కూడా ప్రేక్షకుల్ని పలకరిస్తూ వస్తున్నాడు కమెడియన్ సప్తగిరి. ఈ మధ్యనే 'గూడుపుఠాణి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సప్తగిరి తన నటనతో కొంతమేర ప్రేక్షకుల్ని అలరించాడు.ఇక ఇప్పుడు మరో చిత్రంలో కూడా హీరోగా నటించేందుకు సప్తగిరి బంగారు అవకాశం అందుకున్నాడు.పూర్తి విషయంలోకి వెళ్తే… 'యజ్ఞం', 'పిల్లా… నువ్వు లేని జీవితం' వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి…సప్తగిరిని హీరోగా పెట్టి ఓ సినిమాని రూపొందించనున్నాడు. 'రిగ్వేద క్రియేషన్స్' బ్యానర్ పై 'ప్రొడక్షన్ నంబర్ 1' గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఎ.ఎస్. రిగ్వేద చౌదరి నిర్మించబోతున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నట్టు నిర్మాత ప్రకటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ సినిమాసప్తగిరి నుండీ ప్రేక్షకులు ఆశించే విధంగా మంచి ఫన్ తో నిండి ఉంటుందట.

ఇక ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరినే చెప్పుకొచ్చారు. రవికుమార్ చౌదరి చాలా కసితో ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారని కూడా ఆయన తెలిపారు. ఏమైనా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' 'సప్తగిరి ఎల్ ఎల్ బి' వంటి సినిమాలతో మంచి కమర్షియల్ హిట్లు అందుకున్న సప్తగిరికి ఈ సినిమా అతన్ని హీరోగా నిలబెట్టే బలాన్ని అందిస్తుందేమో అనేది చూడాలి..! సప్తగిరి సినిమాలకి నాన్ థియేట్రికల్ మార్కెట్ కూడా ప్రస్తుతం బాగానే ఉంది.దాదాపు అతని సినిమాలకి ఇప్పుడు రూ.5 కోట్ల వరకు ఓటిటి రేటు అనేది పలుకుతుంది. 'గూడుపుఠాణి' సినిమాని కూడా ఓటిటి కోసమనే తెరకెక్కించి..ఇక ఛాన్స్ ఉంది కదా అని థియేటర్లలో మేకర్స్ రిలీజ్ చేశారు.ఇక కమెడియన్ గా అలరించిన సప్తగిరి హీరోగా నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: