అల్లు అర్జున్ తో కలిసి చాలా గ్యాప్ తరువాత సుకుమార్ తీసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ పుష్ప ది రైజ్. ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి విపరీతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ధనుంజయ, అజయ్, అజయ్ ఘోష్, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ తదితరులు ఇతర పాత్రలు చేసారు.

పక్కాగా మాస్ అంశాలతో సాగే యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఎంతో అద్భుతంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో కూడా అదరగొట్టేలా కలెక్షన్స్ అందుకుంది. ఇక త్వరలో దీనికి కొనసాగింపుగా రానున్న పుష్ప ది రూల్ మూవీ షూట్ ని యూనిట్ మొదలెట్టనుంది.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పార్ట్ 1 ని మించేలా యూనిట్ పార్ట్ 2 కోసం ఎంతో భారీగా ఖర్చు చేయనుందని, ఒకరకంగా పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2కి ఆల్మోస్ట్ డబుల్ రేంజ్ లో బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని సమాచారం. నిజానికి సినిమాపై యూనిట్ కి ఎంత నమ్మకం ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో ఖర్చు అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నప్పటికీ, స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే ఇంత భారీ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారని, తప్పకుంరా రేపు రిలీజ్ తరువాత పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 మూవీ మరింత భారీ విజయం సొంతం చేసుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. ఇక ఈ పార్ట్ 2 పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: