అయితే ఆ తరువాత మరొక్కసారి ఎన్టీఆర్ తో కొరటాల పని చేయాలని భావించారు కానీ కుదరలేదు. ఇక అతి త్వరలో మరోక్కసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 18న అధికారిక పూజా కార్యక్రమాలతో లాంచ్ కానున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆ రోజున ప్రారంభం కోసం యూనిట్ పలు ఏర్పాట్లు సిద్ధం చేస్తోందని సమాచారం.
ఇక ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనుండగా ఆర్ఆర్ఆర్ నటి అలియా భట్ ఇందులో కథానాయికగా ఎంపికైనట్లు టాక్. పక్కాగా మాస్ యక్షన్ జానర్ లో సాగుతూ ఒక మంచి మేసేజ్ ని కూడా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ద్వారా అందించనున్నారని, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు అన్ని భాషల ఆడియన్స్ ని ఈ సినిమా తప్పకుండా ఎంతో ఆకట్టుకుంటుందని ఇన్నర్ వర్గాల న్యూస్. ఇక ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.