పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా ఆయనకు భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకు వస్తాయి అని నమ్ముతున్నాడు. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రం కోసం ఆయన ఎంతగానో కష్టా పడుతున్నాడు. పూరి జగన్నాథ్ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం భారీ స్థాయిలో సమయాన్ని కేటాయిస్తనాడు.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కథ కూడా లాక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి విజయ్ దేవరకొండ 50 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నటీల్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. లైగర్ సినిమా విడుదల అయితే తనకు తప్పకుండా పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధమైన పారితోషకాన్ని తీసుకోవడం సబబే అని చెప్పాలి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలో హీరోగా వచ్చి ఇంత క్రేజ్ సంపాదించుకొని 50 కోట్ల హీరోగా మారడం అంటే మామూలు విషయం కాదు.