ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడవ దశ కరోనా జూలు విధిలిస్తుంది. గతంలో కంటే భారీ ప్రభావం చూపించకపోయినా పాజిటివ్ కేసులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి. దీనికి సంబంధించిన కఠినమైన నియమాలను ప్రభుత్వాలు అమలు చేశాయి. చాలా ప్రాంతాలలో కర్ఫ్యూ లాక్ డౌన్ వంటివి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ పైన కూడా ఈ మూడవ దశ కరోనా భారీ ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. కొన్ని రాష్ట్రాలలో థియేటర్ లలో ఆంక్షలు నెలకొని ఉన్నాయి.

అంతేకాదు షూటింగులకు కూడా అంతరాయాలు కలుగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ లకు అంతరాయం కలిగక పోయినా కూడా మన హీరోలు సినిమా షూటింగ్ లు అంటే ఆమడ దూరం పరిగెత్తుతున్నారు. అలా కరోనా కారణంగా ఇప్పుడు షూటింగ్ లు ఆపేసిన సినిమాల గురించి మనం తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య చిత్రాన్ని విడుదలకు సిద్ధంగా ఉంచిన చిరంజీవి గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ అనే రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నారు.  ఇప్పుడు కరోనా కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్ లను ఆయన ఆపేశాడు.

నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం విజయవంతమైన తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనీ సినిమా షూటింగ్ చేయవలసి ఉండగా కరోనా కారణంగా దాన్ని ఆపివేశాడు. ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలోనీ సినిమాను ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉండగా కరోనా కారణంగానే ఆ చిత్రాన్ని నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లైగర్ సినిమా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ కూడా వేశారు. మరి ఈ సినిమా షూటింగ్ లు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో చూడాలి. అంతే కాదు మరి కొంతమంది హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్ లను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: