నాచురల్ స్టార్ నాని తన సినిమాల పంథా మార్చేశాడా.. మన పక్కింటి కుర్రాడి ఇమేజ్ అతనికి బోర్ కొట్టిందా.. అందుకే నాని కొత్త కథల అన్వేషణలో పడ్డాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అష్టాచమ్మ సినిమా నుండి శ్యాం సింగ రాయ్ ముందు వరకు నాని అంటే ఒక సహజ నటుడు.. ఆ క్రేజ్ తోనే న్యాచురల్ స్టార్ అన్న స్క్రీన్ నేం కూడా సంపాదించాడు. అయితే నాని అంటే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ క్యారక్టరైజేషన్ దాటి కొత్తగా ఏమి చేయట్లేదు. కథలు కొద్దిగా అటు ఇటుగా వెళ్తున్నా క్యార్క్టర్ మాత్రం ఒకే విధంగా అనిపిస్తున్నాయి.

ఏవండోయ్ నాని గారు కాస్త ఇది చూసుకోండని ఫ్యాన్స్ నుండి.. తన వెల్ విషర్స్ నుండి గట్టిగానే ఫీడ్ బ్యాక్ వచ్చినట్టు ఉంది. అందుకే నాని తన పంథా మార్చేసి కొత్త నానిని రంగంలోకి దించాలని ఫిక్స్ అయ్యాడు. దానికి పడిన మొదటి అడుగే శ్యాం సింగ రాయ్. ఆ సినిమాలో శ్యాం సింగ రాయ్ పాత్రలో నానిని ఎవరు ఊహించి ఉండరు. ఆ పాత్రని.. ఆ కథని ఎంచుకోవడంలోనే నాని తనని తాను మార్చుకునేందుకు మొదటి అడుగు వేశాడని అనిపిస్తుంది.

శ్యాం సింగ రాయ్ హిట్ నాని ఖాతాలో హిట్టు పడటమే కాదు నానిని మళ్లీ కొత్త మార్గంలో అడుగు పెట్టేలా చేసింది. అందుకే నాని ఇక మీదట వరుస క్రేజీ కథలతో రావాలని ఫిక్స్ అయ్యాడు. మూస థోరణిలో.. మూస పాత్రలతో వచ్చే కథలకు స్వస్తి పలకాలని గట్టిగా అనుకున్నాడు. ప్రస్తుతం అంటే సుందరానికీ అనే సినిమా చేఏస్తున్న నాని అందులో కూడా కొత్త క్యారక్టరైజేషన్ తో వస్తాడని అంటున్నారు. దీని తర్వాత వస్తున్న దసరా సినిమాలో కూడా నాని కొత్త లుక్ తో.. అదిరిపోయే పాత్రతో సర్ ప్రైజ్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి నానికి నటుడిగా ఇది మరో తొలి అడుగులే అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: