టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వార్తలు వచ్చినా సూపర్ స్టార్ మహేష్ మాత్రం ఏప్రిల్ 1వ తేదీనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం.కరోనా వైరస్ ఇంకా ఇతర కారణాల వల్ల షుటింగ్ ఆలస్యమైతే మాత్రం ఏప్రిల్ నెలలో మరో తేదీకి ఈ సినిమా వాయిదా పడే అవకాశం అయితే ఉందని సమాచారం తెలుస్తోంది.ఫిబ్రవరి చివరి నాటికి తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమాలోని కొన్ని సీన్లను దుబాయ్ లో షూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ లో షూట్ చేసిన ఫైట్ సీన్లలో ఒక సీన్ చాలా అద్భుతంగా వచ్చిందని ఈ సీన్ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం తెలుస్తుంది.

బీచ్ లో ఈ ఫైట్ సీన్ ఉంటుందని మహేష్ ఈ సీన్ లో విదేశీ ఫైటర్లతో సూపర్ ఫైట్ చేస్తాడని సమాచారం తెలుస్తోంది.ఫేమస్ స్టంట్ మాస్టర్స్ ఈ ఫైట్ కోసం పని చేశారని భారీ మొత్తం ఈ ఫైట్ సీన్ కోసం ఖర్చు చేశారని సమాచారం. కఠినమైన పరిస్థితుల్లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ జరిగిందని సమాచారం తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుంది.మార్చి నెల రెండవ వారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో అసలు రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారట.సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి ఉండగా ఈ ఏడాదే ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుందని సమాచారం.సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజయ్యే విధంగా చాలా జాగ్రత్త పడుతున్నారు. సినిమా సినిమాకు సూపర్ స్టార్ మహేష్ కు అభిమానులు లక్షల్లో పెరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: