రెండు రోజుల క్రితం.. హీరో ధనుష్, తన భార్య ఐశ్వర్య విడాకుల నిర్ణయంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు.. ఈ విషయం తెలిసిన కొంతమంది అభిమానులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు వీరిద్దరూ మళ్లీ కలిసి పోవాలని ఆశ పడుతున్నట్లుగా సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ మాత్రం.. ధనుస్ ఐశ్వర్యాలతో మాట్లాడి వీరిద్దరిని ఒకటీ చేయమంటూ మలయాళం నటి అయిన లక్ష్మీ రామన్ కు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడట. దీంతో ఆ నటి స్పందిస్తూ.. వారి వ్యక్తిగత జీవితానికి మనం ఎలాంటి భంగం కలిగించకూడదు అంటూ తెలియజేసింది..
అయినా కూడా కొంతమంది నెటిజన్లు మాత్రం కావాలనే వీరిద్దరి పైన కొన్ని నెగిటివిటీ కామెంట్లను క్రియేటివిటీ చేస్తున్నారు.. అందుకు ఉదాహరణగా స*మంత వ్యవహారం అని చెప్పవచ్చు అని చెప్పుకొచ్చింది. ఎటువంటి గొడవలు,అనుచిత వ్యాఖ్యలు లేకుండా.. చాలా ప్రశాంతంగా వీరు విడిపోవడం జరుగుతోంది.. కాబట్టి మనం వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించకూడదని చెప్పుకొచ్చింది నటి లక్ష్మి.. దయచేసి ఇప్పటికైనా వారిని స్వేచ్ఛగా వదిలేయండి అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే ఈ నటీ చేసిన ట్వీట్ పై మరొక నెటిజన్. వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము.. కానీ ఈ విషయాన్ని (విడాకుల వ్యవహారం) అధికారికంగా చెప్పకుండా ఎవరిదారిన వారు వెళ్లి ఉంటే బాగుండేదని తెలియజేశాడు నెటిజన్.ఇక అంతే కాకుండా.. ఇప్పుడు ఈ విడాకుల వ్యవహారం అనేది చాలా ఫ్యాషన్ గా మారిపోయింది అని నెటిజన్ కామెంట్ రూపంలో తెలియజేశాడు. ఈ విషయంపై లక్ష్మి ఏమన్నారంటే.. అధికారికంగా ప్రకటించక పోతే చాలా తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలియజేసింది. ఇక అంతే కాకుండా స*మంత లాంటి హీరోయిన్ విడాకుల విషయాన్ని.. చాలా హుందాగా చెప్పినప్పటికీ ఆమెపై నెటిజన్లు ఎంత టార్గెట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే అని చెప్పు తెలియజేసింది. అందుచేతనే వారు ఇలా చేశారు అని చెప్పుకొచ్చింది ఈ నటి.

మరింత సమాచారం తెలుసుకోండి: