ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరి నోట వినిపిస్తున్న పేరు కృతి శెట్టి. వరుస హిట్‌లతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ‘ఉప్పెన’ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఓవర్ నైట్‌లో స్టార్ హోదాను ఫిక్స్ చేసుకుంది. అలా వరుస అవకాశాలు పెరగడంతో ఆమె ఫుల్ బిజీ అయింది. మొదటి సినిమాతోనే చాలా మంది ఫాలొవర్స్‌ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈమెకు క్రేజ్ మామూలుగా లేదు. ఉప్పెన సినిమా తర్వాత నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, హీరో నాగార్జున, నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో హీరోయిన్‌గా మెరిసారు.

ఆమె నటించిన ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఇండస్ట్రీలో ఆమెను గొల్డెన్ లెగ్‌గా భావిస్తున్నారు. ఇటీవల ఆమె ‘ఆలీతో సరదాగా’ షోకి వచ్చారు. ఆ షోలో ఆమె తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే ఆలీతో సరదాగా షో హోస్ట్ ఆలీ.. కృతికి కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి ఆమె ఈ విధంగా సమాధానం చెప్పుకొచ్చింది. ఆలీ కృతిని.. నువ్వు ఎవరితో సినిమా చేయాలని అనుకుంటున్నావు..? అని అడగగా.. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు హీరో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. తెలుగులో నేను చూసిన ఫస్ట్ మూవీ ‘రంగస్థలం’. హిందీలో ఆయన డబ్బింగ్ సినిమాలన్నీ చూశాను. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన నాకు ఎంతగానో నచ్చింది. అప్పటి నుంచి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యాను. ఎప్పటికైనా రామ్ చరణ్‌తో కలిసి పని చేయాలనేదే నా కోరిక.’’ అని కృతి శెట్టి తెలిపారు.

అయితే కృతి శెట్టికి పలు భాషలపై పట్టుంది. హిందీ, ఇంగ్లీష్, తుళు, తెలుగు, కన్నడ భాషలు అర్థమవుతాయని, ప్రస్తుతం తమిళం నేర్చుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె హీరో రామ్‌తో కలిసి ‘ది వారియర్’, హీరో సుధీర్ బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’, అలాగే.. హీరో నితిన్‌తో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో మరిన్నీ సినిమాలకు ఓకే చెప్పనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: