చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు న్యాచురల్ స్టార్ నాని. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటించిన హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాను క్రి‍స్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న విడుదల చేయగా.. ప్రేక్షకులను నుండి మంచి స్పందన వచ్చింది.

ఈ మూవీలో నాని డబుల్ రోల్ లో నటించాడు. అయితే ఈ సినిమాలో  నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ బాగుందనే ఎక్కువగా వినిపించింది. ఈ మూవీలో  ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి కూడా హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా మనీష్ వాధ్వా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇందులో మనీష్ మహంత్ పాత్రలో విలనిజం పండించారు.

అయితే ఇంతకీ మనీష్ ఎవరంటే, 1972లో ముంబైలో పుట్టి, ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని స్టార్ చేశాడు. ఆయన బుల్లితెర నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మనీష్ ఎక్కువగా చాణక్యుడు పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు.. చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లలో నటించి, బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఇక బాలీవుడ్ లో మణికర్ణిక, పద్మవత్ సినిమాలలో నటించి, సిల్వర్ స్క్రీన్ మీద తన సత్తా చాటుకున్నాడు.

ఇక ఇప్పుడు శ్యామ్‌సింగ రాయ్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేయాలనే తన కల నెరవేరిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనీష్ వాధ్వా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కొద్దిసేపే కన్పించినప్పటికీ చాలా గంభీరమైన పాత్రలో నటించాడు. అంతేకాదు.. ఈ సినిమా మూవీ షూటింగ్ సమయంలోనే తెలుగులో మరో సినిమా ఛాన్స్ వచ్చిందని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని మనీష్ వాధ్వా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: