రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుందని చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్మెంట్ చేయగా శరత్ మండవ అనే యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తుండటం విశేషం. గతంలో ఈ దర్శకుడు పేరు ఎక్కడా వినపడలేదు. తెలుగు సినిమాలను కాకుండా తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు తన ప్రతిభతో రవితేజ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేయడం విశేషం.
ఇక చిన్న సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడైన పరుశురామ్ ఏకంగా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. పెద్ద పెద్ద దర్శకులు కే సాధ్యం కాని విధంగా ఆయన మహేష్ బాబుతో సర్కార్ వారి పాట అనే మాస్ మసాలా సినిమా చేయడం జరుగుతుంది. మరి పరశురామ్ కథ దీన్నిబట్టి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఇక సాగర్ చంద్ర అనే నూతన దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్ నాయక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నిజంగా పవర్ స్టార్ ను డైరెక్ట్ చేయడం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాడు సాగర్ చంద్ర.