టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ''మైఖేల్''. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. తెలుగులో 'క్రాక్' 'నాంది' వంటి సినిమాల్లో మెప్పించిన వరలక్ష్మీ.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.ఇక ఇదే క్రమంలో ఇప్పుడు యువ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించే పాన్ ఇండియా సినిమాలో జయమ్మ భాగం అయింది.గతంలో సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ' సినిమాలో కూడా వరలక్ష్మి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ''మైఖేల్'' సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రంజిత్ జయకోడి రచించిన విలక్షణమైన స్క్రిప్ట్ లో సందీప్ కిషన్ ఇంటెన్స్ రోల్ లో నటించబోతున్నాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తమ నటుడు విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.'మైఖేల్' సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ ఇంకా అలాగే కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ సంస్థలు రూపొందిస్తున్నాయి. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి ఇంకా పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు ఇంకా సిబ్బంది వివరాలు త్వరలో త్వరలోనే వెల్లడికానున్నాయి.ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా సందీప్ కిషన్ కి ఎలాంటి హిట్టిస్తుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: