తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్ననటి రమాప్రభ. ఆమెకి అక్షరం ముక్క రాకపోయినా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ అందుకుంది. ఆమె స్టార్ కమెడియన్ రాజబాబుతో జతకట్టి ఏకంగా 300కు పైగా సినిమాలలో నటించి బెస్ట్ జోడీగా సినీ ఇండస్ట్రీలో నిలిచిపోయారు. ఇక అప్పట్లో రమాప్రభ, రాజబాబు జోడికి డిమాండ్ ఎక్కువగానే ఉండేదట. ఇక చిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మ గుర్తింపు తెచ్చుకున్న రేలంగితో జతకట్టి అందరి మెప్పు పొందింది.

రమాప్రభ అలనాటి స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబును పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 13 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో కొనసాగారు. అయితే వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈమె.. కలిసి ఉండటం కంటే విడిపోవడమే మేలు అని నిశ్చయించుకొని శరత్ బాబుకు ఆమె విడాకులు ఇచ్చారు. విడాకులు తీసుకున్న తరువాత అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమాప్రభ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అదేంటంటే.. నటకిరీటిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ తన కూతురి భర్త అని చెప్పడంతో సినీ ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అక్క కూతురు విజయ చాముండేశ్వరిని ఏడాది వయస్సు ఉన్నప్పుడే రమాప్రభ దత్తత తీసుకున్నానని, తర్వాత రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తన కూతుర్ని వివాహం చేసుకున్నందుకు గాను రాజేంద్రప్రసాద్ తనకు అల్లుడు అవుతాడని రమాప్రభ చెప్పుకొచ్చింది.

ఆమె మా అసోసియేషన్ వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఒకవేళ తాను చనిపోయినా మా అసోసియేషన్ కు మాత్రం నేను చనిపోయిన విషయాన్ని ఎవరూ తెలియ చేయొద్దు అని చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది. అంతేకాదు.. తనకు ఏ రోజు కూడా మా అసోసియేషన్ గౌరవాన్ని ఇవ్వలేదు అని.. ప్రతి సారి తనను అవమానపరిచింది అని .. అందుకే మా అసోసియేషన్ అంటే నాకు నచ్చదు అని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: