సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ తో పాటే అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సినిమాలు వరుసగా సక్సెస్ అవుతూ ఉంటే క్రేజ్ పెరిగి పోతూ ఉంటుంది. అదే సమయంలో అటు రెమ్యూనరేషన్ కూడా అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే చాలు అటు హీరోలు అమాంతం రెమ్యునరేషన్ పెంచడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి సక్సెస్ మేనియా ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠ పురం లో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని  ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు..



 ఇక అలా వైకుంఠపురం లో సినిమా తరువాత తన హిట్ డైరెక్టర్ టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ తో కలిసి పుష్ప సినిమాలో నటించాడు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కూడా గత ఏడాది డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఏకంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ కి.. ఇప్పుడు రెమ్యూనరేషన్  ఒక్కసారి గా పెంచేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే అల్లు అర్జున్ పుష్ప రెండవ పార్ట్ కోసం మాత్రం ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.



 అల్లు అర్జున్ 50 కోట్లు డిమాండ్ చేసినప్పటికీ అటు నిర్మాతలు  మాత్రం చెల్లించేందుకు సిద్ధంగానే ఉన్నారు అంటూ టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ తో లైకా ప్రొడక్షన్స్సినిమా నిర్మించబోతోంది. సినిమా కోసం రెమ్యూనరేషన్ మరింత పెంచేచేశారట ఐకానిక్ స్టార్.  ఏకంగా 75 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించేందుకు  నిర్మాతలు కూడా సిద్ధమయ్యారట. కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ లుగా అట్లీ, మురుగదాస్ లలో ఎవరో ఒకరు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: