తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ భాషల్లో సూపర్ పాపులర్ అయిన యాక్ట్రెస్ మీరా జాస్మిన్. మళయాళం నుండి వచ్చిన ఈ అమ్మడు సొంత భాషలో సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకోగా తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. తెలుగులో శివాజితో అమ్మాయి బాగుంది సినిమాతో తెరంగేట్రం చేసిన మీరా జాస్మిన్ ఆ తర్వాత పవర్ స్టార్ తో గుడుంబా శంకర్ సినిమా చేశాడు. మాస్ మహరాజ్ రవితేజతో భద్ర సినిమాతో అమ్మడు హాట్ ఫేవరెట్ అయ్యింది. ఓ పక్క తమిళంలో పందెంకోడి కూడా ఆమెకు సెన్సేషనల్ హిట్ ఇచ్చింది.

తెలుగులో తనకు వచ్చిన క్రేజ్ తో స్టార్ హీరోయిన్ అవలేకపోయిన మీరా జాస్మిన్ పెళ్లి తర్వాత కెరియర్ కు కొంత గ్యాప్ ఇచ్చినా భర్తతో సెపరేట్ అయ్యాక మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక లేటెస్ట్ గా మీరా జాస్మిన్ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రాం లోకి అడుగుతు పెట్టింది. ఇలా ఇన్ స్టాగ్రాం ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా ఒక్కరోజులోనే లక్షమంది ఫాలోవర్స్ ని తెచ్చుకుంది మీరా జాస్మిన్. ఇది చాలు మీరా జాస్మిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడానికి.

తెలుగులో ఆమె చేసిన సినిమాలు ఓ మోస్తారుగా అనిపించాయి. అందుకే మీరా జాంసిన్ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులు ఎలర్ట్ అవుతున్నారు. ఇక ఈమధ్యనే మళయాళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ సరైన ఛాన్స్ వస్తే తెలుగులో కూడా నటించాలని అనుకుంటుందట. మీరా జాస్మిన్ చేయాలని చెప్పాలే కాని ఆమె కోసం కొత్త కథలతో దర్శకులు క్యూ కట్టే అవకాశం ఉంది. అప్పట్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్ మళ్లీ కెరియర్ లో తిరిగి ఫాం లోకి వస్తే మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.



   

మరింత సమాచారం తెలుసుకోండి: