ఒక భాషలో భారీ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది నటీనటులు ఇతర భాషలలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అక్కడ వారికి ఏర్పడిన డిమాండ్ దృష్ట్యా పాత్రలు కూడా వారు నటించాలని డిమాండ్ చేస్తే సదరు దర్శక నిర్మాతలు తప్పకుండా ఇతర భాషల నుంచి వారిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అలా ఇప్పటిదాకా ఇతర భాషల నుంచి ఎంతోమంది నటీనటులు మన టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సత్తా చాటారు.  ఇప్పుడు కూడా కొంత మంది టాలీవుడ్ లో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో  ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అర్జున్ రాంపాల్. బాలీవుడ్ లో ఆయన ఏ స్థాయి నటుడో అందరికీ తెలిసిందే. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు పోషించే ఈ నటుడు తెలుగులో సినిమాలు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పవన్ నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమాతో అరంగేట్రం చేయడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది అని చెప్పవచ్చు. 

ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ సినిమా అయినా కూడా తెలుగు హీరో కావడంతో ఈ చిత్రం తెలుగు లో స్ట్రెయిట్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విధంగా బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న ఈ హీరో ఇప్పుడు తెలుగులో అరంగేట్రం చేస్తూ ఉండడం విశేషం. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా అజయ్ దేవగన్ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. ఇక గని చిత్రం ద్వారా నటుడు సునీల్ శెట్టి కూడా తెలుగులో కి పూర్తి స్థాయిలో రాబోతున్నాడు. ఇప్పటికే ఆయన తెలుగులో కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: