హీరో బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, ఈ చిత్రం నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి హాజరయ్యారు. ఆ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్న సుదర్శన్ థియేటర్లో అఖండ చిత్రాన్ని చూసారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. సినిమాను థియేటర్లో చూస్తే ఆ మజానే వేరు అని పేర్కొన్నారు. అఖండ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అఖండ చిత్రంలో హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్తో పాటు అందరూ బాగా చేశారని బాలయ్య కొనియాడారు.
ప్రకృతి దేవుడు జోలికి వస్తే దేవుడు అఖండ రూపంలో దుష్ట శిక్షణ చేస్తాడనే విషయాన్ని ఈ చిత్రంలో ప్రస్తావించినట్టు బాలయ్య చెప్పారు. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీనును, నన్ను ఇద్దరినీ ఆ దేవుడే కలిపాడని అంటుకుంటున్నట్టు చెప్పారు బాలయ్య. ఈ సినిమా సక్సెస్ ప్రేక్షకులతో పాటు ఆ ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులకు కూడా దక్కుతుందని తెలిపారు.
మరొకవైపు నందమూరి బాలయ్య నాపై ఉంచిన నమ్మకం మరొకసారి నిజం అయింది. ఈ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్రెడ్డితో పని చేసిన ప్రతి టెక్రిషియన్కు బోయపాటి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ సమయంలో సినిమా విడుదలైతే.. ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారా రానా అనే అనుమానాలను పటా పంచలు చేస్తూ.. ఈ సినిమా సాధించిన విజయం అమోఘమన్నారు. కరోనా తరువాత 50 రోజుల పాటు ఇలాంటి జోరుచూపించిన సినిమా మరొకటి లేదు. కేవలం తెలుగులోనే కాదు. భారతదేశంలోనే ఈ రికార్డు సాధించిన ఏకైక హీరో బాలయ్య. 24 సెంటర్లలో అఖండ 50 రోజులు పూర్తి చేసుకున్నది. 50వ రోజు చిత్రం 103 థియేటర్లలో ప్రదర్శించడం బాలయ్య అఖండ చిత్రం విషయంలో సాధ్యమైందనే చెప్పొచ్చు.