టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లేటెస్ట్ గా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ నటులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ సినిమా వాస్తవానికి మొన్న సంక్రాంతి కానుకగా ఈనెల 7న రిలీజ్ కావాల్సి ఉండగా ఒక్కసారిగా మన దేశంలో కరోనా కేసులు మళ్ళి విజృంభించడంతో పలు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ విధించాయి, దానితో ఆర్ఆర్ఆర్ మూవీని వాయిదా వేశారు. అయితే దీని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు రాజమౌళి.

ఇటీవల రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సౌత్ ఆఫ్రికా లోని అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని, అయితే కథ పూర్తి అయిన తరువాతనే దీని గురించి చెప్పగలను అని ఆయన అన్నారు. మరోవైపు ప్రస్తుతం రాజమౌళి కూడా మహేష్ మూవీ స్టోరీ కోసం తండ్రితో కలిసి జాగ్రత్తగా రెడీ చేయిస్తున్నారని టాక్. అయితే ఈ సమయంలో కొందరు రాజమౌళికి ఎంతో తలనొప్పిగా మారారని సమాచారం.

కాగా వారు మరెవరో కాదు, ప్రస్తుతం అటు రాజమౌళి మహేష్ కోసం కథ సిద్ధం చేస్తుంటే మరోవైపు పలువురు బడా దర్శకులు సైతం మహేష్ ని కలిసి స్టోరీ లు వినిపిస్తున్నారని టాక్. అసలే తమది ఎంతో భారీ ప్రాజక్ట్ అని, ఈలోపు ఎవరైనా ఇతర దర్శకుల కథలు కనుక మహేష్ కి నచ్చి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమ మూవీ మరింతగా లేట్ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన భావిస్తున్నారట. అందుకే తండ్రితో సహా టీమ్ మొత్తంతో కలిసి సూపర్ స్టార్ మూవీ కథ కోసం పక్కాగా రాజమౌళి కసరత్తు చేస్తున్నారని, త్వరలో అది పూర్తి అయిన అనంతర మహేష్ కి వినిపించి మూవీ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని టాక్. మరి అందరిలో ఎప్పటినుండో ఎంతో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: