తెలుగు సినిమా సెలెబ్రిటీలలో చాలా వరకు ఒకే దగ్గర కలిసి పనిచేస్తూ ఉండడం వలన లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కవగా ఉంటాయి. కొందరు ప్రేమ వరకు వెళ్లి ఆగిపోతూ ఉంటారు. మరి కొందరు మాత్రం ప్రేమించుకుని పెళ్లి వరకు వెళుతుంటారు. కానీ ఇలా నిన్న మొన్నటి వరకు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని తెలియగానే వారి అభిమానులు కూడా ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతుంటారు. అయితే ఇలా ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్న వారు సడెన్ గా కొన్ని సంవత్సరాల తర్వాత విడుపోతున్నాము అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఎవరి దారిన వారు వెళ్లిపోతుంటారు.

ఇప్పటి వరకు ఇలా చాలా జంటలను చూశాము. అలాంటి జంటల్లో ఒకటే నాగచైతన్య మరియు సమంతలది. వీరిద్దరికీ తెలుగు ప్రేక్షకులలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరు విడిపోయాక చాలా బాధపడ్డారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు తాజాగా సమంత చేసిన ఒక పని వలన మళ్లీ వీరిద్దరూ కలుస్తారు ఏమో అన్న ఆశలు పుట్టాయి. ఇంతకీ సమంత ఏమి చేసింది అనేది ఇప్పుడు చూద్దాం .

తన అధికారిక ఇన్స్టా గ్రామ్ ఖాతా నుండి విడాకులకు సంబంధించిన పోస్ట్ ను డిలీట్ చేసింది. దీనితో ఈ విషయం తెలిసిన వారంతా విడాకులు తీసుకుని తప్పు చేశాను అన్న ఫీలింగ్ తో ఇలా చేసి ఉంటుంది. అందుకే తన తప్పు తెలుసుకుని మళ్లీ నాగ చైతన్యతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఈ పోస్ట్ ను డిలీట్ చేసింది అంటూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం ఆ పోస్ట్ ను డిలీట్ చేయకపోవడం గమనార్హం. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: