పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒకప్పుడు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ బొమ్మ తీసిన నిర్మాత సూర్య మూవీస్ అధినేత ఏ.ఎం రత్నం చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడు దర్శకత్వంలో వస్తున ఈ మూవీ చారిత్రాత్మక కథతో వస్తుంది. సినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాలతో పాటుగా ఓ టీజర్ అంచనాలు పెంచింది. పవన్ కళ్యాణ్ కెరియర్ ఇప్పటి వరకు ఇలాంటి ఓ ప్రయత్నం చేయలేదని చెప్పాలి. ఇదిలాఉంటే ఈ సినిమా మొదలై రెండేళ్లు అవుతుంది. అయినా సరే సినిమా ఓ కొలిక్కి రాలేదని టాక్.

మాములుగా అయితే క్రిష్ తన సినిమాలను ఎప్పుడూ పర్ఫెక్ట్ బడ్జెట్ తో.. తక్కువ టైం లో అనుకున్న విధంగా పూర్తి చేస్తాడు. కానీ హరి హర వీరమల్లు సినిమాకు అలా జరగట్లేదు. 2020లో మొదలైన హరి హర వీరమల్లు సినిమాకు కొవిడ్ ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఆ ఎఫెక్ట్ తో సినిమా కొన్ని షెడ్యూళ్లు వాయీఅ పడుతూ వచ్చాయి. ఈలోగా పవన్ భీంలా నాయక్ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ సినిమా కోసం కొంత డేట్స్ ఇచ్చేసరికి హరి హర వీరమల్లు కొంత గ్యాప్ వచ్చింది.

మరోపక్క హరి హర వీరమల్లు చేస్తూనే డైరక్టర్ క్రిష్ వైష్ణవ్ తేజ్ తో కొండపొలం సినిమా చేశాడు. ఈ గ్యాప్ లో నిర్మాతకు ప్రొడక్షన్ కాస్ట్ బాగా అయ్యాయని టాక్. సినిమా అనుకున్న విధంగా షూటింగ్ జరగకపోవడం వల్ల నిర్మాతకు ఎక్స్ ట్రా లాస్ వస్తుందని తెలుస్తుంది. సినిమా ఈపాటికి పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉన్నా ఇంకా సగం సినిమా చేయాల్సి ఉందని అంటున్నారు. ఈమధ్యనే క్రిష్ హరి హర వీరమల్లు కి సంబందించిన షెడ్యూల్ కోసం పవన్ ని కలిశాడు. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అన్నది నిర్మాత ఏ.ఎం రత్నం కు ఓ టెన్షన్ పట్టుకుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: