టాలీవుడ్ సంగీత దర్శకులలో నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుని తన కెరీర్లో ఎప్పుడూ లేని స్టార్డమ్ అనుభవిస్తున్న సంగీత దర్శకుడు తమన్. ఆయన తాజాగా తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ అందరిని అయోమయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా మహేష్ అభిమానులను ఎంతగానో కలవరపెడుతుంది ఈ పోస్ట్ అని చెప్పవచ్చు. గత నాలుగేళ్లుగా తన సంగీతం తో ప్రేక్షకులను భారీస్థాయిలో ఆకట్టుకుంటూ వరుస సూపర్ హిట్ లను సాధించుకుంటు పోతున్న తమన్ అప్పుడప్పుడు ఇలా కొన్ని ఆసక్తికర విషయాలను తన సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటాడు.

ఎక్కువగా తను సంగీతం అందించే సినిమాల విషయాలను ముందే చెబుతూ ఆ చిత్రంపై తన సంగీతం పై మంచి క్రేజ్ ఏర్పడేలా చేసుకుంటాడు. ఆ విధంగా ఆయన చెప్పిన ప్రతి సారి కూడా సదరు సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల అయ్యి తమన్ కు సంగీతం పరంగా మంచి పేరును తీసుకువస్తుంది. తాజాగా మహేష్ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వడం అందరినీ ఎంతో ఆనందపరిచింది. అయితే గతంలోనూ ఇదే విధమైన అప్డేట్ ను ఇచ్చి చివరకు ఆ అప్డేట్ లేదని చివరకు చావు కబురు చల్లగా చేప్పేశాడు. ఇదే ఇప్పుడు మహేష్ ను మళ్ళీ కలవరపెడుతుంది.

కేవలం డేటు మాత్రమే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చూచాయగా అప్డేట్ చెప్పాడు. అయితే ఇది మహేష్ సినిమా గురించి అనీ పసిగట్టిన మహేష్ అభిమానులు తమన్ ను ఏ విధమైన అప్డేట్ ఇస్తున్నారు అని ఆయనను అడుగుతున్నారు. అది తెలియాలంటే ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆగాల్సిందే అని తమన్ చెప్పడం కొంతమందికి నిరుత్సాహం కలిగించింది. పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట ఫస్ట్ సింగిల్ ఆ రోజు విడుదల అవుతుందని ప్రచారం మరోవైపు జరుగుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: