తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లను పూర్తిచేసుకున్న  విషయం తెలిసిందే. ఇక ఈ రియాలిటీ షో పై నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు వచ్చినా.. ఈ షోను అభిమానించే వారి సంఖ్య భారీ స్థాయిలోనే ఉండటం విశేషం. అయితే ఇది ఇలా ఉంటే త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ లో ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటి కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అంతేకాకుండా ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్ లను నిర్వాహకులు సెలక్ట్ చేశారని సమాచారం.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీలో అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ అయినా హీరో నవదీప్ కూడా ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటీటీ కోసం కొత్త కంటెస్టెంట్ ల తో పాటు గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు కూడా అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న నవదీప్ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ ఓటీటీ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా? అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే నిర్వాహకులు నవదీప్ ని సంప్రదించగా అతను పాల్గొనడానికి సముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మరి దీనిపై పూర్తి స్పష్టత వస్తే గాని ఏం చెప్పలేం.
 

ఇక మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ని కూడా కింగ్ నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ 24 గంటల పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని.. బిగ్ బాస్ సీజన్ 5  కోసం వాడిన సెట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి బిగ్ బాస్ ఓటీటీ కోసం ఆ సెట్ ను వినియోగించనున్నారని సమాచారం. దాదాపు 15 మంది కంటెస్టెంట్ లో పాల్గొనే ఈ షో సుమారు 82 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈసారి కూడా సోషల్ మీడియా సెలబ్రిటీలకు చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: