ఇక కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ కథతో చేసిన ఓ సినిమా గత కొంత కాలంగా కోవిడ్ వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ మరుగున పడింది. ఈ సినిమాని చివరికి ఓటీటీలోనే విడుదల చేస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీని మేకర్స్ థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. అదే `గుడ్ లక్ సఖి`సినిమా.నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఆది పినిశెట్టి ఇంకా జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.గత సంవత్సరం థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 28న థియేటర్లలో విడుదల కాబోతోంది.ఇక  ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం ఆఫీషియల్ గా ప్రకటించారు. దిల్రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి ఈ సినిమాని నిర్మించారు. 

ఇక ఇందులో కీర్తి సురేష్ ఓ దురదృష్టవంతురాలైన తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతోంది. నేషనల్ లెవెల్ లో షూటర్ గా నిరూపించుకోవాలన్న ఆమె కోరిక నెరవేరిందా? .. ఇక చివరికి ఏం జరిగింది? అనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ గిరిజన యువతిగా కనిపించింది. ఓ సాధారణ యువతి ఇక తన అసాధారణ ప్రతిభతో షూటర్ గా నేషనల్ లెవెల్ లో ఎలా పేరు తెచ్చుకుంది అనే కథతో దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించారు. ఇక చాలా కాలంగా కూడా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. ఇక గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్న కీర్తి ఈ సినిమాలతో హిట్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: