టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి బరి నుంచి వైదొలగి తరువాతి రిలీజ్ తేదీని వెతుక్కుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా స్పష్ఠంగా అధికారిక ప్రకటన అనేది వెలువడాల్సి ఉంటుంది.ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీ ప్రమోషన్స్ గురించి తెలిపడం జరిగింది. ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి వరుస సింగిల్స్ విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని ఖరారు చేస్తూ.. అతను మ్యూజిక్ లవ్ ఎమోజీలను కూడా జోడించాడు. సర్కారు వారి పాట నుండి మొదటి సాంగ్ విడుదల గురించి అతను సూచించాడని ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు. ఈ వార్త ఉభయ అభిమానులను బాగా ఆనందపరిచింది. ప్రస్తుతానికి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా 1 ఏప్రిల్ 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు కోవిడ్ మహమ్మారి సోకిందని సూపర్ స్టార్ మహేష్ బాబే స్వయంగా తన సోషల్ మీడియా అన్ని అకౌంట్ ల ద్వారా వెల్లడించడం అనేది జరిగింది. ఇక ఓ పోస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వెల్లడిస్తూ..``నాకు మైల్డ్ సింప్టమ్స్ అనేవి బయటపడ్డాయి. అందుకే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అనేది తీసుకుంటున్నాను`` అని మహేష్ బాబు తెలిపారు. ప్రజలంతా కరోనా వైరస్ మహమ్మారి నియమనిబంధనలు విధిగా పాటించాలని కూడా మహేష్ బాబు కోరారు.సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా పెండింగ్ షూటింగ్ ని చాలా వేగంగా ముగించేందుకు ప్రణాళికల్లో ఉన్నారు.ఇక తరువాతి సినిమా త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయన మోకాలికి కూడా ఇటీవల శస్త్ర చికిత్స జరిగినట్టు కథనాలొచ్చాయి. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి నుంచి వేగంగా కోలుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి ఇతర షెడ్యూల్స్ పైనా దృష్టి సారించే వీలుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: