ఇటీవలే 'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమాను క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా  బాలయ్య కెరీర్ లో 107 వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్యకు జోడీగా నటిస్తోంది. అలాగే తమిళ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇక గత ఏడాది చివర్లో వచ్చిన ఆఖండ సినిమా ఇంకా థియేటర్లో తన మాస్ జాతరను కొనసాగిస్తూనే ఉంది.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 103 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడూ బాలయ్య 107 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బాలయ్య - గోపిచంద్ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టి విలన్ పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నాడు. మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ లేడీ విలన్ గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.పల్నాడు బ్యాక్ డ్రాప్ లో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

అయితే ముందుగా ఈ సినిమాకు 'వేటపాలెం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇక సినిమాలో ఒక రోల్ లో బాలయ్యను అందరూ పెద్దాయన అని పిలుచుకుంటారట. అంతేకాదు ఈ పాత్ర సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు వేటపాలెం కంటే 'పెద్దాయన' అనే టైటిల్ ఫిక్స్ చేస్తే బలంగా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా తరహాలో తండ్రీకొడుకుల నేపథ్యంలోనే ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు.ఇక త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: