కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ముదురుతుందన్న విషయం తెలిసిందే. దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తుంది రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూ ప్రజలను భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇక సినీ సెలబ్రిటీస్ కి కరోనా ఎటాక్ చేస్తుంది. ఇప్పటికే చాలామంది సినీ హీరోలకు, హీరొయిన్స్ కు కరోనా సోకగా ఈ లిస్ట్ లో చేరాడు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్. తనకు కరోనా వచ్చిందన్న విషయాన్ని స్వయంగా ప్రకటించాడు తరుణ్ భాస్కర్. కరోనా వచ్చిన విషయన్ని కూడా కామెడీగా చెప్పి జాగ్రత్తగా ఉండండని చెప్పాడు తరుణ్ భాస్కర్.

తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో హాయ్ ఫ్రెండ్స్.. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. టేకింగ్ రెస్ట్ ఫ్రెండ్స్.. దాన్ని సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ తరుణ్ భాస్కర్ తనదైన కామెడీ స్టైల్ లో చెప్పాడు. విజయ్ దేవరకొండతో పెళ్లిచూపులు, విశ్వక్ సేన్ తో ఈనగరానికి ఏమైంది సినిమాలతో పాపులర్ అయిన తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ నిర్మాణంలో మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటుడిగా మారాడు. ఈ సినిమాలన్ని అతనికి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చాయి.

ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న ఒకే ఒక జీవితం సినిమాకు డైలాగ్స్ రాస్తున్నాడు తరుణ్ భాస్కర్.. ఆ సినిమతో పాటుగా ఓ మై కడవులే సినిమా రీమేక్ గా వస్తున్న సినిమాకు కూడా డైలాగ్స్ రాస్తున్నాడు. ఈ సినిమాలతో తరుణ్ భాస్కర్ మరోసారి తన సత్తా చాటనున్నాడు. తన నెక్స్ట్ డైరక్షన్ మూవీ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న తరుణ్ భాస్కర్ తనకు కావాల్సిన టైం దొరికేసిందని చెప్పొచ్చు. ఈ టైం లో తరుణ్ ఓ మంచి కథ రెడీ చేసుకునే ఛాన్స్ ఉంది. తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడిన విషయాన్ని ప్రకటించగానే అతని ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: