కరోనా మహమ్మారి ఆరోగ్య పరంగానే కాదు మానసికంగానూ వ్యక్తుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లే కనిపిస్తున్నాయి కొన్ని పరిస్థితులను చూస్తుంటే.. మనుషుల్లో ఎన్నడూ లేనంతగా అసహనం  కలిగి అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్న దాఖలాలు ఇప్పటికీ చాలానే చూస్తున్నాం. కరోనా టైంలో పనులు మాని మరీ ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతున్న క్రమంలో బంధాలు బలపడతాయి అనుకుంటే.. అపార్ధాలు పెరిగి వ్యక్తుల మధ్య దూరాలు పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ముఖ్యంగా గత రెండేళ్లలో ఎన్నో సెలబ్రిటీ జంటలు విడిపోయి అభిమానులకు పెద్ద షాకులనే ఇచ్చాయి.

ప్రేమ వివాహం చేసుకుని ఎంతో అన్యోన్యంగా కనిపించిన నాగచైతన్య - సమంత విడిపోవడం ప్రతి ఒక్కరిని ఎంతగానో బాధ పెట్టింది. ఇక తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ - ఐశ్వర్య తమ పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం మరో పెద్ద షాకే. ఇంకా ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి మన ఇండస్ట్రీలో. ఇక తాజాగా మరో సెలబ్రెటీ జంట విడాకుల గురించి సమాచారం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే... తెలుగులో 'పెళ్లి చూపులు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా తన భార్య లత నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం అందుతోంది. వీళ్ళిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారా? లేదా? అనేది తెలియడం లేదు కానీ ఇద్దరూ విడి విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

తరుణ్ భాస్కర్ - లత ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడం విశేషం. అంతేకాదు ఈ నగరానికి ఏమైంది సినిమాలో మనం చూసింది తరుణ్ భాస్కర్ వ్యక్తిగత జీవితాన్నే. అందులో అనీషా ఆంబ్రోస్ చేసిన పాత్ర నిజ జీవితంలో లత జీవితం నుంచి స్ఫూర్తి పొంది తరుణ్ భాస్కర్ రాసుకున్నదే. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా మారడానికి ముందే లత తో అతనికి పెళ్లయిపోయింది. ఫ్యాషన్ డిజైనర్ అయిన లత గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పాడు తరుణ్ భాస్కర్. అంతేకాదు ఆమె తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో కూడా చాలాసార్లు కనిపించింది. అతని సినిమాల మేకింగ్ లలోకూడా ఆమె కీలక పాత్ర పోషించడం విశేషం. అలా ఎంతో అండర్ స్టాండింగ్ తో కనిపించిన ఈ జంట ఇప్పుడు విడిపోవడం వారి స్నేహితులకు పెద్ద షాక్ గా మారింది. అయితే ఈ విషయాన్ని తరుణ్ భాస్కర్ - లతా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: