మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసిన సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. బుచ్చి బాబు సన డైరక్షన్ లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా వైష్ణవ్ తేజ్ కెరియర్ కి గుడ్ స్టార్ట్ ఇచ్చింది. అయితే సెకండ్ సినిమా కొండపొలం క్రిష్ జాగర్లమూడి డైరక్షన్ లో చేయగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం గిరీశయ్య డైరక్షన్ లో ఒక సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ లో మరో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. మెగా హీరోల్లో నిన్న మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది.

జిం లో తన ట్రైనర్ తో బాక్సింగ్ చేస్తూ తనని ఎటాక్ చేశాడు వైష్ణవ్ తేజ్. మరి మెగా మేనల్లుడి దెబ్బ అంటే మాములుగా ఉంటుందా. వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ చేసే సినిమాకు ఏమైనా బాక్సింగ్ నేపథ్యం ఉంటుందో లేక ఫిట్ నెస్ కోసం అలా కష్టపడుతున్నాడో కానీ వైష్ణవ్ తేజ్ వర్క్ అవుట్ చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. మెగా హీరోల్లో తనకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవాలని ఫిక్స్ అయ్యాడు.  

గిరీశయ్య సినిమా లవ్ స్టోరీగా వస్తునని తెలుస్తుంది. మరో పక్క సితార బ్యానర్ లో సినిమాకు క్రేజీ డైరక్టర్ పనిచేస్తారని తెలుస్తుంది. సినిమాల సెలక్షన్ లో వైష్ణవ్ తేజ్ చాలా జాగ్రత్త వహిస్తున్నాడని అర్ధమవుతుంది. ఉప్పెన ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో.. కొండపొలం అంత డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా మెసేజ్ ని ఎవరు అర్ధం చేసుకోలేకపోయారు. అందుకే కెరియర్ లో మళ్లీ కొండపొలం లాంటి తప్పులు జరుగకుండా ప్లాన్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.





మరింత సమాచారం తెలుసుకోండి: