కింగ్ నాగార్జున సంక్రాంతికి బంగార్రాజు అంటూ వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. పొంగల్ కి రావాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్న టైం లో రిలీజ్ అవ్వాల్సిన రెండు పాన్ ఇండియా మూవీస్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో నాగార్జున బంగార్రాజుని రిలీజ్ చేశారు. ఓ విధంగా నాగార్జున తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే అయితే సినిమా మీద అతనికి ఉన్న నమ్మకం ప్రాజెక్ట్ ని నిలబెట్టింది. ఫైనల్ గా నాగార్జున బంగార్రాజుఓ ఓ సూపర్ హిట్ కొట్టాడు. నాగ చైతన్యకి ఇది వరుసగా నాలుగో బాక్సాఫీస్ విజయం అవడం విశేషం.

ఇదిలాఉంటే బంగార్రాజు ప్రస్తుతం రెండో వారం లోకి అడుగు పెట్టింది. సినిమా అనుకున్న రేంజ్ కి మించి సక్సెస్ అయినందుకు నాగార్జున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఆ తర్వాత ఓ రెండు వారాల పాటు ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండనున్నారని తెలుస్తుంది. బంగార్రాజు ప్రమోషన్స్ టైం లో తన టీం లో కొందరికి కొవిడ్ రాగా వారిని ఐసోలేషన్ లో ఉంచారట. అయితే నాగార్జునకి ఎలాంటి సింటమ్స్ వగైరా లేకపోయినా గోవా వెళ్లి ఓ రెండు వారాలు బయటకు రాకుండా ఐసోలెట్ అవ్వాలని అనుకుంటున్నారట. గోవాలో అమలతో నాగార్జున రెండు వారాల పాటు అక్కడే ఉండనున్నారని తెలుస్తుంది. రెండు వారాల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందట.      

ఇక బంగార్రాజు హిట్ అందుకోగా తన నెక్స్ట్ సినిమా ది ఘోస్ట్ సినిమా త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అంతకుముందు కాజల్ హీరోయిన్ గా అనుకోగా ఆమె సినిమాలకు దూరం అవుతున్న కారణంగా సోనాల్ చౌహాన్ ని ఈ మూవీ కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బంగార్రాజుతో కెరియర్ లో మళ్లీ బూస్టింగ్ అందుకున్న నాగ్ ఇక మీదట అదే హిట్ మేనియాతో కొనసాగాలని చూస్తున్నారు. ది ఘోస్ట్ తర్వాత సినిమా ఏంటన్నది ఇంకా డిసైడ్ చేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: