ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే ఒక డ్రీమ్ ఉంటుంది. ఇక అలాంటి ఒక కల నెరవేరితే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు.. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే తన డ్రీమ్ హౌస్ నిర్మించుకొని తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వాటిలో ఒక మెట్టు పైకి ఎదిగిందని చెప్పవచ్చు.తాజాగా ముంబై ప్రాంతంలో తన సొంతింటి కలను నిర్మించుకుంది. నిన్నటి రోజున తన సొంత ఇంటి లోకి గృహప్రవేశం చేసినట్లుగా తెలియజేసింది. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలలో పాల్గొని ఈ ముద్దుగుమ్మ తన ఫోటోలను షేర్ చేసింది.

ఇక ఈ సందర్భంలోనే ఒక ఎమోషనల్ పోస్టును కూడా షేర్ చేసింది.. ఒక సంవత్సరం పాటు తన ఇంటి నిర్మాణం జరిగిందని.. ఈ కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా కష్టపడి మీ కలలను నెరవేర్చుకొని అంటూ తెలియజేసింది. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని తెలియజేసింది.ఇక దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్ల సైతం ఆమె పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ప్రస్తుతం తన ఫోటో కాస్త ట్రెండింగ్ గా మారుతోంది. గత కొద్ది రోజుల క్రిందటే పూజా హెగ్డే మాల్దీవులకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అక్కడే సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నటువంటి కొన్ని బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది.ప్రస్తుతం ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది పూజా హెగ్డే.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలోనే నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఒక పీరియాడిక్ మూవీలో నటిస్తోంది. ఇక చిరంజీవి,తన కుమారుడు రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య లో కూడా పూజ హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈమె నటించిన అన్ని సినిమాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా తన డ్రీమ్ ను కంప్లీట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది పూజ హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: